సిరా న్యూస్,కడప;
పులివెందుల లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి మీడియా సమావేశం నిర్వహించారు. అయన ఆయన మాట్లాడుతూ పులివెందులలో స్వేచ్ఛయుత వాతావరణంలో ప్రశాంతంగా పోలింగ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఓటర్లు కూడా ఓట్లు తమకు వేస్తున్నారని స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని అన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, అందరూ తమకే మద్దతు తెలిపారన్నారు. పులివెందుల ఎప్పుడు జరగని విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగిందని అన్నారు. పోలీసులు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటాడనే ఉద్దేశంతో పోలీసు వ్యవస్థ వారికి అనుకూలంగా పని చేశారని అన్నారు. మా ఏజెంట్లను ప్రభావితం పెడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని అన్నారు. పులివెందులలో 20 కి పైగా బూతుల లో ఎమ్మెల్యే ఓటు టిడిపికి వేసుకొండి … ఎంపీ ఓటు వైసీపీ కి వేసుకుంటామని కొంతమంది ఏజెంట్లు ప్రలోభ పెట్టడం జరిగిందని అన్నారు. షర్మిలమ్మ గెలుస్తుంది అనే ఉద్దేశంతోనే ఎంపీ ఓటు వైసీపీకి వేసుకుంటామని అన్నార అని ప్రశ్నించారు. కొన్ని సంక్షేమ పథకాలకు ఎలక్షన్ల ముందు డబ్బులు వేయాలని చూసారని ఎలక్షన్ కమిషన్ అడ్డంకుల వల్ల వేయలేకపోయారని, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్లు అయిపోయిందని, ఇప్పుడు రెండు మూడు రోజుల్లో ఆ డబ్బులు మొత్తం వేయాలని అప్పుడు వారికి నిజాయితీ ఉన్నట్లు ఒప్పుకోవచ్చని అన్నారు. సిఎస్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కాంట్రాక్టర్లకు ఆ డబ్బులు వేసుకుంటారని అన్నారు. ప్రజలకైతే ఆ డబ్బులు వేయరని అనుకుంటుమన్నరు.