10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలోమాత్రం మధ్యాహ్నం క్లాసులు
ఏప్రిల్ 24న ప్రస్తుత విద్యాసంవత్సరానికి చివరి పని దినం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు జూన్ 12న ప్రారంభం
సిరా న్యూస్,హైదరాబాద్;
మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.క్రమంగా ఎండలు పెరుగుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. అయితే.. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలోమాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులతో పాటుగా వేసవి సెలవుల పైన స్పష్టత వచ్చింది. పదో తరగతి పరీక్షలకు కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి పూట బడులను నిర్వహిస్తారని విద్యాశాఖ పేర్కొంది. ఈ స్కూళ్లలోముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి..తర్వాత తరగతులుకొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత.. యథావిథిగా ఉదయం పూట తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ అన్ని పాఠశాలలకు అదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 24న ప్రస్తుత విద్యాసంవత్సరానికి చివరి పని దినంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకువేసవి సెలవులు ప్రకటించనున్నారు. తిరిగి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు జూన్ 12న ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల పైన ప్రభుత్వంఅధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది. గతం కంటే ఈ సారి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగాఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో, ప్రభుత్వం పాఠశాలల్లో ఒంటిపూట బడులనిర్వహణ పైన నిర్ణయం ప్రకటించింది.