సిరా న్యూస్;
సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి పెనం మీద నుంచి పోయిలో పడ్డట్టుగామారింది. ‘2017లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో సీలింగ్ లేకుండాకార్పొరేట్ సంస్థల నుంచి ఎంతైనా విరాళం తీసుకోవచ్చనే బీజేపీ బిల్లు ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అసలు డోనర్స్ ఎవరో తెలియకుండా విరాళాలు వద్దని..ఓటర్లకు చెప్పాలని .. ఎలక్ట్రోరల్ బాండ్స్ ను ఎవరైనా తీసుకోవచ్చన్నదికరెక్ట్ కాదని సుప్రీంకోర్టు తెలిపింది. రాజకీయ పార్టీలకు నల్ల ధనంచేరకుండా అడ్డుకునేందుకు, పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత కోసం ఈబాండ్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఈబాండ్లు మారాయని విమర్శకులు అంటున్నారు. ఈ బాండ్ల చుట్టూ గోప్యత సంకెళ్లుఉన్నాయని వారు విమర్శిస్తున్నారు.
అసలు ఈ బాండ్లు ఎవరు కొంటున్నారు?ఎవరికి వీటిని ఇస్తున్నారు? లాంటి వివరాలను ప్రజల ముందు ఉంచడం లేదు,అందుకే వీటిని రాజ్యాంగ విరుద్ధమైనవని విమర్శలు వస్తున్నాయని అసోసియేషన్ఫర్ డెమొక్రాటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. అదే సమయంలో ఇక్కడపూర్తిగా గోప్యత ఉందని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ బ్యాంకుల దగ్గరఅటు బాండ్లు కొంటున్నవారు, ఇటు తీసుకుంటున్న వారు.. ఇద్దరి వివరాలూఉంటున్నాయి. అంటే ప్రభుత్వం కావాలంటే ఈ వివరాలను తమకు అనుకూలంగాఉపయోగించుకోవచ్చు. లేదా విరాళాలు ఇచ్చే వారిని ప్రభావితం కూడా చేయొచ్చుఅని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.ఏప్రిల్ నుంచి తీసుకున్నవారందరి వివరాలు బయటపెట్టమని సూచించింది. ఇప్పుడు దీన్ని రద్దు చేయమనడంఎంత వరకూ కరెక్ట్ అనేదో తెలియదు.సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల విరాళాలుఇచ్చిన వారు ఇప్పుడు బయటపడుతారు. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంవాటిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగవిరుద్ధమని, దానిని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారంప్రకటించింది.
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సమాచారహక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.2019 ఏప్రిల్ 12 నుంచిఇప్పటి వరకూ కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్కు అందించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్డీవై చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు.మూడు వారాల్లోగా ఈ సమాచారం ఎన్నికలకమిషన్కు అందజేయాల్సి ఉంటుంది. 2024 మార్చి 13లోగా ఈ సమాచారాన్ని తమవెబ్సైట్లో ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టుకోరింది.రాజకీయ పార్టీలు ఇంకా తీసుకోని, 15 రోజులలోపు చెల్లుబాటు ఉన్నఎలక్టోరల్ బాండ్లను తిరిగి కొనుగోలుదారులకు ఇచ్చేయాలని సుప్రీంకోర్టుపేర్కొంది.రాజకీయ పార్టీలు, సంస్థలకు వచ్చిన నిధుల గురించి బహిర్గతంచేయాల్సిన అవసరం లేదంటూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టురాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఇది ఆర్టికల్ 19(1)(a)ప్రకారం ఓటర్ల సమాచార హక్కును ఉల్లంఘించినట్లేనని పేర్కొంది.పార్టీలుతమకు అందిన విరాళాల వివరాలను అందించాల్సిన అవసరం లేకుండా ఈ స్కీమ్లోచేసిన చట్ట సవరణలను సవాల్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫామ్స్తోపాటు కాంగ్రెస్ పార్టీ నేత జయా ఠాకూర్,కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ఇండియా(మార్క్సిస్టు), మరికొందరు వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు తీర్పుచెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పును ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కొనియాడారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేస్తుందనిప్రశాంత్ భూషణ్ అన్నారు.రైన బ్యాంకింగ్ మార్గాల రాజకీయ విరాళాల వల్లబ్లాక్ మనీ ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. అలాగే, దాతలపైరాజకీయ పార్టీలు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోకుండా వారి వివరాలను గోప్యంగాఉంచడం కూడా అవసరమని ప్రభుత్వం వాదించింది.ప్రభుత్వ వాదనలపై రాజ్యాంగధర్మాసనం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ‘సెలెక్టివ్ అనానిమిటీ’ఉద్దేశపూర్వకంగా వివరాలు గోప్యంగా ఉంచడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ,పార్టీలకు ఆర్థికంగా వెన్నదున్నుగా నిలిచే ప్రక్రియను చట్టబద్ధంచేస్తున్నారా అని ప్రశ్నించింది. దాతల వివరాలు తెలుసుకోవడం అధికారపార్టీకే సాధ్యమని, విపక్ష పార్టీలు అలాంటి సమాచారాన్ని పొందలేవనిధర్మాసనం పేర్కొంది.అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకంనిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని ధర్మాసనంవ్యాఖ్యానించింది.
అలాగే, కంపెనీలు తమ నికర లాభంలో గరిష్టంగా 7.5 శాతంమాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వాలనే షరతును తొలగించడంపై కూడాధర్మాసనం ప్రశ్నలు సంధించింది.రాజకీయ పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకతఅవసరమనే అంశంతో అందరూ ఏకీభవిస్తున్నారు. ఎన్నికలు నానాటికీ చాలాఖరీదైనవిగా మారుతున్నాయి. వీటికి చాలా వరకు ప్రైవేటు విరాళాలే ఆధారం.2019సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు 7 బిలియన్ డాలర్లు (రూ.5,72,59కోట్లు)గా అంచనాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అంత మొత్తంలోఎన్నికల కోసం ఖర్చు చేస్తోంది ఇక్కడే.నానాటికీ ఇక్కడ ఓటు హక్కుపొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 90 కోట్ల మంది ఓటుహక్కు కోసం రిజిస్టర్ చేసుకున్నారు. 1952లో ఇది కేవలం 4 లక్షలు మాత్రమే.అంటే ఓటర్లకు చేరువయ్యేందుకు అభ్యర్థులు మరింత ఎక్కువ మొత్తాన్ని ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. చాలాచోట్ల మూడంచెల వ్యవస్థ (గ్రామ, రాష్ట్ర, కేంద్రప్రభుత్వం) అమలులో ఉంది. అంటే ఇక్కడ మూడంచెల్లో ఎన్నికలు నిర్వహించాల్సిఉంటుంది.