సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకం లోని రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది.సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 39.5 లక్షల లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ను రిలీజ్ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం మూడు క్రైటీరియాలను ప్రకటించింది. లబ్ధిదారులు తొలుత పూర్తి ధర చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.500పోగా మిగిలిన సొమ్మను 48 గంటల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు అందించింది.