సిరా న్యూస్,భద్రాచలం;
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. 46 అడుగులకి చేరుకున్న నీటి మట్టం..మరో రెండు అడుగులకి ధూరం లో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయీకి వరద ప్రవాహం చేరుకోనుంది. గంట గంట కి వరద ప్రవాహం పెరగడంతో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారి చేసారు. ఎగువన కురుస్తున్న వర్షాలకి తాలిపేరు ప్రాజెక్ట్ లోకి లక్షాల క్యూసెక్కుల నీరు చేరడంతో పెద ఎతున నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. భారీవర్షాలకి నీట మునగనున్న భద్రాచలం పట్టణంలోని ముంపు కాలనీ వాసులను , రామాలయం ముంపు ప్రాంత ప్రదేశాలలోని ప్రజలను,దుకాణదారులను ముందుగానే అధికారులు అప్రమత్తం చేసారు. రామాలయం మరియు కొత్త కాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీలలోకి నీరు చేరకుండాఎప్పటికప్పుడు మోటర్లను సిద్ధంగా ఉంచి వాటి పనితీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
రామాలయం దగ్గర గోదావరి పరివాహ ప్రాంతం లోని స్నానాల ఘాట్ వద్దకు భక్తులు,పర్యాటకులు రావద్దంటూ పోలీసులు హెచ్చరించారు.