2024 కొత్త సంవత్సరంలో భవిష్యత్తు ప్రజా ఉద్యమాలదే.

చెప్పులు కుడుతూ తమ నిరసన తెలిపిన కార్మికులు.
సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనన్న

బద్వేలు;
కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7రోజులో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద చెప్పులు కుడుతూ తమ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనన్న మాట్లాడుతూ….
ఆనాడు మున్సిపల్ కార్మికులను పొగడ్తలతో ముంచేత్తిన పాలకులు నేడు వారిపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని,పారిశుధ్య కార్మికులకు లక్ష రూపాయలు జీతం ఇచ్చిన తక్కువేనని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు నేడు వేతనాల పెంపుపై పెదవి విరచడం శోచనీయమని, సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని కోర్టులు తీర్పునిచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కార్మికుల అంటే లెక్కలేదు కోర్టు తీర్పులు అన్న లెక్కలేదు ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, పైపెచ్చు అందరికీ వేతనాలు పెంచేసామని ప్రజలను పక్కదారి పట్టించడం సూచనియమన్నారు, కొంతమందికి వేతనాలు పెంచి సంక్షేమ పథకాల్లో కోత పెట్టి కార్మికులను సర్కారు మోసగించిందని, పని భారం పెంచి కార్మికుల నడ్డి విరిచిందని ఎన్నికలకు ముందు పర్మినెంట్ చేస్తామని మాట ఇచ్చి నేడు విస్మరించిందని, రెగ్యురైజ్ చేయమని అడిగితే నేరమని సమ్మెను పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడంపై దృష్టి పెట్టిందని కార్మికులపై కక్ష సాధిస్తుందని ఇవేమీ తెలియనట్లు ముఖ్యమంత్రి నటిస్తున్నారని ఇలా నిరంకుశ చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయని కార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తున్న కమ్యూనిస్టులపై దుష్ప్రచారం చేయడం తగదని పేదలకు కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కార్మికుల వెన్ను విరడం దుర్మార్గమని అండగా నిలిచే వారిపై బురద చల్లటం అమానుషమని కార్మిక హక్కులు హరించడంలో మోడీ జగన్ ప్రభుత్వాలు రెండు ఒకే బాటలో ప్రయాణిస్తున్నయని కార్మిక చట్టాలను కార్మిక కోడ్ ల పేరుతో మోడీ ప్రభుత్వం హరిస్తుందని 2023 వ సంవత్సరం కార్మిక ప్రజా ఉద్యమాలతో ముగిస్తుందని, 2024వ సంవత్సరం కార్మిక నిరసనలతో ప్రారంభమవుతుందని, కనీసం కొత్త సంవత్సరంలోనైనా ప్రభుత్వం కార్మికుల సమ్మెకు ముగింపు పలికి కోర్కెలు అంగీకరించాలని లేనియెడల ఉద్యమాలను ఉధృతం చేయడం తప్ప మరో మార్గం లేదని కొత్త సంవత్సరంలో కార్మిక ఉద్యమాలు విజయం సాధిస్తాయని ప్రజల అండతో ముందుకు సాగుతాయని విధానాల మార్పుపై పోరు సాగిస్తాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు గౌతమి, పట్టణ అధ్యక్షురాలు అనంతమ్మ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, వడ్డెర వృత్తిదారుల సంఘం పట్టణ నాయకులు గంప సుబ్బరాయుడు, సిఐటియు పట్టణ నాయకులు రాజగోపాల్, యూనియన్ పట్టణ అధ్యక్షులు పులి శ్యాం ప్రవీణ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు దియ్యాల దేవమ్మ, గంటా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు నాగరపు సత్యరాజు, బద్వేల్ ప్రవీణ్ కుమార్, నేలటూరు పాలయ్య, కోశాధికారి కాలువ శివకుమార్ కమిటీ సభ్యులు పద్మిశెట్టి రామయ్య, ఇండ్ల చంద్రశేఖర్, తేళ్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *