సిరా న్యూస్, ఓదెల
గడ్డం వంశీకృష్ణ గెలుపు తో ఓదెలలో సంబరాలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,581ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసందర్భంగా మంగళవారం ఓదెల మండలంలోని కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సంబరాలలో ఓదెల ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి చిన్నస్వామి, అల్లం సతీష్ ,బండారి కుమారస్వామి, అప్పని తిరుపతి, మార్క సదానందం సతీష్, గడిగొప్పుల సంతోష్, తీర్థాల వీరన్న, మాచర్ల కొమురయ్య, పచ్చిమట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.