సిరా న్యూస్ భీమదేవరపల్లి
తెలంగాణ ప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల అంబేద్కర్ సంఘం నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, దళిత బహుజన వర్గాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ముల్కనూర్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేశారు. అనంతరం గద్దర్ ప్రజల కోసం చేసిన పోరాటాలను మరొకసారి గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.