సిరా న్యూస్, బేల
కుష్టు వ్యాధిపై ఆందోళన చెందవద్దు
* జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ గజానన్
కుష్టు వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ గజానన్ అన్నారు. శనివారం బేల మండల కేంద్రంలో సిర్సన్న లో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి ఆధునిక చికిత్సతో పూర్తిగా నయమవుతుందని పేర్కొన్నారు. శరీరంపై పాలిపోయిన, రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలు ఉన్నట్లయితే, కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆశా కార్యకర్తలకు తెలియ చేయాలని కోరారు. కుష్టు వ్యాధిని ఏ దశలోనైనా పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. వైద్య సిబ్బందికి ఆశా కార్యకర్తలకు తగు సూచనలు చేశారు. అనంతరం పీహెచ్ సి ని సందర్శించి, రికార్డు లను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ అధికారి వామన్ రావు ఎల్ టి రమణాచారి ఏఎన్ఎం స్వర్ణలత ఆశా కార్యకర్తలు ప్రేమల, రత్న గీత,అనసూయ, లక్ష్మి పాల్గొన్నారు.