ade Gajender: కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

సిరాన్యూస్‌, బోథ్‌
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
* కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్
* కాంగ్రెస్ లో ప‌లువురు చేరికలు

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమ‌ని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం లోని చింతల్ బోరి గ్రామానికి చెందిన బీజేపీ సినియర్ నాయకులు ముండే శ్రీధర్, అంకుష్,రాజు, మచ్చేందర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం ముండే శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని, గజేందర్ నాయకత్వం లో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేసారు.అనంతరం వారు ఆడే గజేందర్ , ఏఎంసీ చేర్మెన్ కి శాలువాతో సత్కరించారు. కార్యక్రమం లో ఏఎంసి చైర్మ‌న్‌ బొడ్డు గంగారెడ్డి, ఏఎంసి డైరెక్టర్ ఇసురు పటేల్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, సీనియర్ నాయకులు గాజుల పోతన్న, ప్రకాష్, అమృత్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *