సిరా న్యూస్, చిగురుమామిడి
రాష్ట్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలకు గంప సంపత్ కుమార్ కు ఆహ్వానం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉద్యమాల పురిటిగడ్డ బొమ్మనపల్లి గ్రామానికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రామంలో నిర్వహిస్తున్న తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారుడు చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన గంప సంపత్ కుమార్ కు ఆహ్వానం అందింది. ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.ఆనాటి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో గంప సంపత్ కుమార్ చురుగ్గా పాల్గొన్నారు. బొమ్మనపల్లి గ్రామంలోని వెయ్యి మంది మహిళలతో హుస్నాబాద్ వరకు పాదయాత్ర, వందరోజుల నిరాహార దీక్షలు, తెలంగాణ ఉద్యమ కళా సహకారానికి అనేక రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసి పాల్గొన్నారు.ఆనాడు చేసిన సేవలు గుర్తుగానే రాష్ట్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించినట్లుగా తెలిపారు.