సిరా న్యూస్,బోథ్
భగత్ సింగ్ త్యాగం నేటి యువతరానికి ఆదర్శం కావాలి
* బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగయ్య
భగత్ సింగ్ జీవితం నేటి తరానికి ఆదర్శంగా ఉండాలని ఆయన చేసిన త్యాగం దేశం కోసం అని బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగయ్య అన్నారు.శనివారం మండల కేంద్రంలోని భగత్ సింగ్ చౌక్లో ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అతి చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన యోధుడు అన్నారు. దేశభక్తిని ప్రతి యువకుడు అలవర్చుకొని దేశం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగభూషణం పాఠశాల ప్రిన్సిపాల్ కిషోర్ కుమార్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, వీడీసీ అధ్యక్షులు గట్ల గంగాధర్, సిపిఐ నాయకులు గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి , మున్నూరు కాపు సంఘం నాయకులు అల్లకొండ పోతన్న, బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్, టీజీవీబీ నాయకులు శ్రీనివాస్, పొట్లూరి ప్రవీణ్, సంతోష్, బూత్ నియోజకవర్గ కన్వీనర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.