సిరా న్యూస్,సింహాచలం;
సింహాద్రి అప్పన్న ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు.
గంటా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వై. సి. పి. ప్రభుత్వానికి బాగా బుద్ది చెప్పారు.. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు అనుకోవడం లేదు. మ్యానిఫెస్టో లో పెట్టిన అంశాలతో పాటు, సింహాచలం దేవస్థానం భూముల సమస్య కూడా పరిష్కరించాడానికి కృషి చేస్తాం. పోలింగ్ రోజు ప్రక్క రాష్ట్రల నుండి ప్రజలు వొచ్చిన తీరు చూస్తే అప్పుడే వారు వంసై డే అన్నట్లుగా అనిపించింది. ఒక జాతరకు పల్లెటూర్ల నుండి కుంటుంబాలు ఎలాగైయితే వస్తారో, కూటమికి ఓట్లు వెయ్యడానికి అలా తరలి వొచ్చారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడినిఒక క్రిమినల్ లాగ అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యడాన్ని కూడా ప్రజలు గమనించి, కసితో బాబుని గెలిపించారు…
జగన్ మోహన్ రెడ్డి ముందున్నవి రెండే.. ఒకటి రాజకీయాలను వొదిలేయడం, వ్యాపారాలను చూసుకోవడం, రెండు ఆయన పార్టీలో ఓడిపోయినా మంత్రుల కోసం పరామర్శ, పాదయాత్ర చేసుకోవడం మంచిది. భీమిలి చరిత్రలో రికార్డ్ స్థాయిలో మెజారిటీ ఇవ్వడం అక్కడ ప్రజలకు నేను ఋణం తీర్చుకుంటాననని అన్నారు.
============================XXXX