సిరాన్యూస్, సైదాపూర్:
మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసిన గర్రెపల్లి గ్రామస్తులు
సైదాపూర్ మండలంలోని గర్రెపల్లి గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను గర్రెపల్లి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో సైదాపూర్ మండలంలో గ్రామపంచాయతీల సంఖ్య 26 నుండి 29 కి చేరింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంతంగి రవీందర్, కౌడగాని కిషన్ రావు, కౌడగాని మోహన్ రావు, వేముల కొమురయ్య, వేముల నాగార్జున, మామిడి మల్లేష్, వేముల, చందు, వేముల వినయ్, బెల్లి సుమంత్, సుంక బాపన్న ఉన్నారు.