జియో ఇన్ఫర్మేటిక్స్ విద్యార్థి గౌతమ్ కృష్ణ తేజ కు డాక్టరేట్ ప్రధానం

సముద్ర గర్భ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై పరిశోధనలు చేసిన గౌతం

పుదుచ్చేరి యూనివర్సిటీ నుండి అండమాన్ లో పరిశోధనలు

గవర్నర్లు కిరణ్ బేడీ, నరసింహన్
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు నుండి
అభినందనలు అందుకున్న గౌతం

సిరా న్యూస్,కరీంనగర్;

డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో పరిశోధన విద్యార్థి గుండా గౌతం కృష్ణ తేజ కు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్( పి హెచ్ డి) ప్రధానం చేసింది. డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయన ఈ పరిశోధన నిర్వహించారు. కరీంనగర్ కోతి రాంపూర్ కు చెందిన గౌతమ్ కృష్ణ తేజ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ పర్యవేక్షణలో జియో డైనమిక్స్ ఆఫ్ బార్రెన్ ఐలాండ్ వాల్కనిజం, ఇన్సైడ్స్ ఫ్రొమ్ జియో స్పెషల్ టెక్నాలజీ అనే అంశంలో పరిశోధన చేశారు.ఉస్మానియా విశ్వవిద్యాలయ భూగోళశాస్త్ర ప్రొఫెసర్ నగేష్ ఆధ్వర్యంలో డాక్టరేట్ పట్టాను అందజేశారు. డాక్టరేట్ అందుకున్న గౌతమ్ కృష్ణ తేజను తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ సైన్స్ డీన్ ప్రొఫెసర్. ఆరతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ అరుణ, మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు అత్తర్ అలీ డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ హెడ్ డాక్టర్ కవితా తురన్, అధ్యాపకులు డాక్టర్ సబిత, డాక్టర్ ప్రతిజ్ఞ, డాక్టర్ నారాయణ, వివిధ డిపార్ట్మెంట్ల అధ్యాపకులు పరిశోధనా విద్యార్థులు విద్యార్థులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *