సిరా న్యూస్,జైనథ్
జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించిన గెడం రాకేష్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని అకోలి గ్రామానికి చెందిన గెడం రాకేష్ జూనియర్ లెక్చరర్ గా ఎంపికయ్యారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గురుకుల జూనియర్ లెక్చరర్ ఫలితాలల్లో కెమిస్ట్రరీ అధ్యాపకుడిగా ఉద్యోగం సాదించారు. గెడం రాకేష్ ప్రాథమిక విద్య అంకోలి గ్రామంలో చదివారు. హైదరాబాద్లోని ఓయూలో పీజీ చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రాకేష్ చిన్నతనం నుంచి కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాన్ని సాధించారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గెడం రాకేష్ను అభినందించారు.