Geekur Ravinder: నిస్వార్థంగా పనిచేసే ఏ ఉద్యోగికైనా సమాజంలో గౌరవం:  జడ్పీటీసీ గీకుర్ రవీందర్

సిరాన్యూస్,  చిగురుమామిడి
నిస్వార్థంగా పనిచేసే ఏ ఉద్యోగికైనా సమాజంలో గౌరవం:  జడ్పీటీసీ గీకుర్ రవీందర్
ఘ‌నంగా కార్యదర్శి ఎండి ఇసాక్ ఖాన్ ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ

విధుల్లో నిస్వార్థంగా పనిచేసే ఏ ఉద్యోగికైనా సమాజంలో గౌరవం దక్కుతుందని జడ్పీటీసీ గీకుర్ రవీందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముదిమాణిక్యం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండి.ఇసాక్ ఖాన్ పదవీ విరమణ అభినందన సభ కార్యక్రమాన్ని ఎంపీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం చాలా సవాళ్ళతో కూడినదని గ్రామాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమయ్యే వారు పంచాయతీ కార్యదర్శులు అన్నారు. జడ్పీటీసీ గీకుర్ రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు జీవితకాలం ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుందని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల బాధ్యత కలిగి,గ్రామాల అభివృద్ధికి కష్టపడి పనిచేసే వారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అని, పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం సమాజంలో ఆదర్శనియం అని అన్నారు .తన నుండి చాలా నేర్చుకున్నామని తన సమయపాలన అందరికీ ఆదర్శం అని పలువురు తెలిపారు. పదవి విరమణ అనంతరం ప్రజలకు సేవ చేసేందుకు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు.తనకు ఇన్నిరోజులు సహకరించిన ప్రజలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు,నాయకులకు కార్యదర్శి ఇసాక్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పదవీ విరమణ పొందిన ముదిమాణిక్యం పంచాయతీ కార్యదర్శి ఎండీ ఇసాక్ ఖాన్ దంపతులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ముది మాణిక్యం గ్రామ ప్రత్యేక అధికారి తాహసిల్దార్ ఇప్ప నరేందర్,ఎంపీడీవో మధుసుదన్,మండల ప్రజా పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ ఖాజా మొయినోద్దీన్,కార్యాలయ సిబ్బంది,వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ముదిమాణిక్యం గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *