సిరాన్యూస్, చిగురుమామిడి
రైతులకు సరిపడా జీలుగ విత్తనాలు పంపిణీ: జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్
* కొరత ఉందన్నది అవాస్తవం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రైతులందరికి సరిపడా జీలుగ విత్తనాలు అందుబాటులో ఉంటాయని జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ తెలిపారు. సోమవారం చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు జీలుగ విత్తనాల కొరత ఉందని వార్తలు వస్తున్న సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి రంజిత్ రెడ్డితో తాను మాట్లాడినట్లు తెలిపారు. మండలంలో ఇప్పటికీ 80 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు సరఫరా అయ్యాయని, రెండు రోజుల్లో మరో 50 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వస్తాయని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులందరికీ సరిపడా విత్తనాలను వ్యవసాయ అధికారులు సబ్సిడీ మీద పంపినీ చేస్తారన్నారు. అంతేగాక వ్యవసాయ అధికారులు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శిక్షణ కార్యక్రమంలో ఉన్నారని, త్వరలోనే మండలంలోని అన్ని క్లస్టర్లలో ఈ ఖరీఫ్ సీజన్ కి సంబంధించి రైతులకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తారన్నారు.