భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి
సిరా న్యూస్,తిరుపతి;
స్థానికంగా వుంటున్న కృష్ణ కిషోర్ దంపతులు తమకు తెలిసిన యువతులను గంజాయికి బానిసలు చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్నారు. పద్మావతి యూనివర్సిటీలో బీఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతికి గంజాయి అలవాటు చేసారి దంపతులు. తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. కృష్ణకిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించడమే కాకుండా మహిళ వీడియోలు తీసింది.బాధితురాలి అన్నకు, కాబోయే భర్తకు వీడియోలు, ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్ చేసారు. దాంతో బాధితురాలు తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించింది.పోలీసులు భార్యాభర్తలను రిమాండ్కు తరలించారు. గతంలోనూ ఓ యువతిని మోసం చేసి రూ.5 లక్షలు కాజేసినట్టు విచారణలో వెల్లడయింది.