సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించిన కమిషనర్ రోనాల్డ్ రోస్
సిరా న్యూస్,హైదరాబాద్;
కేబీఆర్ పార్క్ లోని వాక్ వేను జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఖైరతాబాద్ జోనల్ అధికారులతో కలిసి పరిశీలించారు. వాక్ వే లో ఇబ్బందులను తెలుసుకున్నారు. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లనిర్మాణం, పార్క్ లో శుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న వ్యర్ధాలు ఉండటానికి గమనించిన కమిషనర్ తక్షణమే శుభ్రం చేయాలనిఆదేశించారు. పాదాచారులకు ఇబ్బందులు లేకుండా ఎగుడు దిగుడుగా ఉన్న వాక్ వే ను సరి చేయాలని సూచించారు. కేబీఆర్ పార్కు వచ్చే వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికితీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ పరిశీలించారని ఆయన చేసిన సూచనల మేరకు వాక్ వే ను సరి చేయించడం, మంచినీటి సౌకర్యం నిర్మించనున్నట్లు జోనల్ కమిషనర్ వెంకటేష్ తెలిపారు.