సిరా న్యూస్,ఖమ్మం;
తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రచారం పుట్టుకొచ్చింది. మూఢ నమ్మకాలను తొందరగా విశ్వసించే ప్రజలు ఒక కొత్త విశ్వాసాన్ని తెరపైకి తెచ్చి ఆచరిస్తున్నారు. ఆచరించడమే కాదు.. అందరూ ఆచరించేలా “మౌత్ టాక్”తో తెలంగాణ అంతటా వెలుగులోకి తెచ్చారు. అదేంటో తెలుసా? దాని పేరే “గాజుల కానుక”. ఇప్పుడు ఈ గాజుల కానుక ప్రచారం ఎవరి నోట చూసినా వినిపిస్తుంది. ఇద్దరు కొడుకులు ఉన్న మహిళల వద్ద ఒక్క కొడుకు ఉన్న మహిళలు డబ్బులు అప్పుగా తీసుకోవాలాట. ఆ డబ్బులతో ఐదు రకాల గాజులను కొనుగోలు చేసి వాటిని చేతికి వేసుకోవాలట. అప్పుడు వారికి ఎలాంటి కీడు ఉండదట. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ ఈ నయా మూఢ నమ్మకం ట్రెండింగ్ లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నోళ్లలో నానుతున్న ఈ నయా సంప్రదాయం ఫాలో కాని పక్షంలో కీడు జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది.మూఢ నమ్మకాలను బాగా విశ్వసించే జనం కొందరు అదే పనిగా దీన్ని ఆచరిస్తూ తమ చుట్టు పక్కల ప్రజలకు కూడా తెలియజెబుతున్నారు. అందరూ ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యేలా కొందరు పనిగట్టుకుని ఫోన్లు చేస్తూ ఆచరించేలా చేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఎక్కడ చూసినా ఆడపడుచుల గాజుల వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. ఈ మూఢ నమ్మకం పుణ్యమాని గాజుల దుకాణదారులకు భలే గిరాకీ తగిలింది. గాజులకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు కొందరు నిపుణులు. ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మొద్దని సూచిస్తున్నారు. గాజులు వేసుకున్నంత మాత్రాన వచ్చేదీ లేదు.. వేసుకోకపోతే జరిగేదీ ఏం ఉండదని చెబుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలే తప్ప మూఢ విశ్వాసంతో కాదని నొక్కి వక్కాణిస్తున్నారు. ఏదేమైనా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు మహిళామణులు.లంగాణలో ఒక ప్రచారం వైరస్ లా వ్యాపించింది. ఒక్క కొడుకు ఉన్న మహిళ చేతినిండా ఐదు రకాల గాజులు ధరించాలని, లేకుంటే ఒక్కగానొక్క కొడుకుకు ఇబ్బంది కలుగుతుందని కొందరు ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన మహిళలు గాజుల దుకాణాలకు క్యూ కట్టారు. పైగా ఒక షరతు పెట్టారు. ఇద్దరు మగబిడ్డలున్న మహిళల నుంచే గాజులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో ఇద్దరు మగబిడ్డలున్న మహిళల చెంతకు వెళ్లి వారిని అభ్యర్థిస్తున్నారు. మట్టి గాజుల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. సంక్రాంతి దినాలు కీడురోజులుగా భావించి ఒక మగబిడ్డ ఉన్న మహిళ ఖచ్చితంగా ఐదు రకాల గాజులను రెండు చేతులకు ధరించాలని చెప్పడంతో గాజుల దుకాణాలకు గిరాకీ పెరిగింది.అయితే దీనిని పిచ్చి చర్యగా కొట్టిపారేస్తున్నారు. ఎలాంటి అరిష్టం లేదని పండితులు చెబుతున్నారు. అయినా వినకుండా టీవీలు, సామాజిక మాధ్యమాల్లో చూసిన మహిళలు మాత్రం మట్టి గాజులే కదా? వేసుకుంటే ఏం పోతుంది? అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వారిలో ఉన్న భయాన్ని కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నంలోనే భాగంగానే ఈకొత్త కాన్సెప్ట్ ను బయటకు తీసుకువచ్చారన్న వాదన కూడా లేకపోలేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఒక్క కొడుకు ఉన్నప్పటికీ గాజులు వేసుకోకున్నా అరిష్టం ఏమీ ఉండదని, చెడు జరగదని మాత్రం పండితులు సూచిస్తున్నారు.