సిరా న్యూస్,ఖమ్మం;
ఎంతో అమితంగా ప్రేమించిన ప్రేయసి క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో ప్రేయసి లేని బాధను తట్టుకోలేక ఓ యువకుడు ఆవేదనతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. దీంతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన అమర్లపూడి సతీష్ (21)అనే వ్యక్తి ఖమ్మంకు చెందిన ప్రవళిక(19 అనే అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన అమ్మాయికి క్యాన్సర్ వ్యాధి సోకి రెండు నెలల క్రితం మరణించింది. ప్రేమికురాలు మృతిని గత రెండు నెలల నుంచి మనోవేదనతో తట్టుకోలేక తాను కూడా ఉండలేనంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.