రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్షణ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం
ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం జయ
సిరా న్యూస్,చెన్నారావుపేట;
బాలికలకు ఆత్మరక్షణ పద్ధతులను అందించేందుకు ‘రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్ష శిక్షణ’ కార్యక్రమం పేరుతో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి ,ఫిబ్రవరి, మార్చి మూడు నెలల పాటు వారానికి మూడు రోజుల చొప్పున వారంలో 3 సెషన్లు, నెలవారీ 12 సెషన్ల పాటు ఆత్మ రక్షణ తరగతులను నిర్వహించారు.
టెక్నికల్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా కియో ఏ గ్రేడ్ రెఫరీ,బ్లాక్ బెల్ట్ సెవెంత్ డాన్ ,జపాన్ డిప్లమా సాధించిన కరాటే శిక్షకుడు, రచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 80 మంది బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఆకతాయిల ఆగడాల నుంచి బాలికలు తమను తాము రక్షించుకోవడం, శారీరక దృఢత్వం సాధించడం, మానసికోల్లాసం కలిగించేందుకు ఆత్మరక్షణ విద్య ఎంతో ఉపయోగపడుతుందని ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తేజావత్ జయ అన్నారు.కరాటే నేర్చుకుంటే బాలికల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని,ధైర్యంగా ఆకతాయిల వేధింపులను ఎదుర్కొంటారని,ఏదో ఒకరూపంలో వేధింపులకు గురవుతున్న తరుణంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనం కలిగించనుందని , అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ప్రతి రంగంలో ముందంజ వేయాలని జయ కోరారు.సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ అనేది బాలికల భద్రత కోసం,దాడికి గురయ్యే ప్రమాదాన్ని అధిగమించడానికి మరియు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి దోహద పడుతుందని శిక్షకుడు రచ్చ శ్రీనివాస్ తెలిపారు.ఈరోజు జరిగిన శిక్షణ కార్యక్రమంలో శిక్షణలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో హెచ్ ఎం జయతో పాటు ఉపాధ్యాయులు ఎస్ సునీత, రాగి శశిధర్ ,కె.సంతోష్ కుమార్,బాలాజీ రావు, ఏ.ఉదయ్ కుమార్, సిహెచ్ మాధవి, జి.సుందర్, కె. మాధవి టి.మురళి, బి.రవీందర్, కె.మోహన్ రావు, ఓ.కృష్ణ, రమేష్, జూనియర్ అసిస్టెంట్ జాహేద్, క్రాఫ్ట్ టీచర్ చింతకింది ఇందిర తదితరులు పాల్గొన్నారు.