మహిళలు భూ యాజమానులయ్యేలా ప్రొత్సహించండి
సిరా న్యూస్,హైదరాబాద్;
మహిళా రైతు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. సాగు భూమి రిజిస్ట్రేషన్ చార్జీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇవ్వాలి. మహిళలు భూ యాజమానులయ్యేలా ప్రొత్సహించాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తామని హమీ ఇచ్చారు. భూమి అంటే ఆర్థిక వనరే కాదు సమాజంలో గౌరవం, అధికారం. భూమిపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపడతాం. సాగు భూమి రిజిస్ట్రేషన్ చార్జీల్లో మహిళలకు 50 శాతం రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీతక్క అన్నారు.