అవినీతిపరులకు ఓటుతో బుద్ధి చెప్పండి..

వేమిరెడ్డి దంపతులు
 సిరా న్యూస్,కోవూరు;
ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న వేళ వేమిరెడ్డి దంపతులు ప్రసన్న కుమార్ రెడ్డి పై పదునైన విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో దువ్వూరి కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి లకు ప్రజలు ఇందుకూరుపేటలో బ్రహ్మరథం పెట్టారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవినీతిపరులకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా గ్రావెల్ మాఫియా లతో ప్రసన్న కుమార్ రెడ్డి కోట్లు గడిచాడు అన్నారు. తమ విలువైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని గ్రామ ప్రజలు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇందుకూరుపేట ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *