Goats: కలుషిత నీరు తాగి 24 మేకలు మృతి

కుందుర్తి, సిరా న్యూస్ 

కలుషిత నీరు తాగి 24 మేకల మృతి

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లి కురుబ ఏర్రి స్వామికీ చెందిన మేకలు శుక్రవారం కలుషిత నీటిని తాగి మృత్యువాత పడ్డాయి. ఎర్ర స్వామికి తన 70 మేకలను గ్రామ సమీపంలోనీ ఓ తోటకు మేత కోసం తీసుకెళ్లాడు. మధ్యాహ్న సమయంలో సమీపంలో తోటలో ఉన్న నీటి తొట్టిలో కలుషిత నీటిని  తాగాయి. దీంతో 24 మేకలు క్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పశు సంవర్దక శాఖ ఏడీ నాగలింగేశ్వర్ రెడ్డి, పశు వైద్యుడు సాయి సుమంత్  వెంటనే అక్కడకు వెళ్లి కొన ఊపిరితో ఉన్న ఆరు మేకలకు వైద్యం చేసి  కాపాడారు. మేకల కాపరిని ఆదుకోవాలని మాజీ ఎంపీ రామ్ భీమప్ప, సర్పంచ్ ఈరన్న, నాయకుడు యాదవ్ అధికారులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *