చిగురుమామిడి, సిరా న్యూస్
బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా శోభాయాత్ర
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో గుట్ట మీది శివాలయంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. రామనామస్మరణతో ఆలయం మారుమోగింది. అన్నదానం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీరామ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.