God Ramudu: రాముడి ప్రాణప్రతిష్టను ప్రత్యక్షంగా వీక్షించిన గ్రామస్తులు

ఆదిలాబాద్ సిరా న్యూస్ 

భక్తి శ్రద్ధలతో మారుమోగిన గ్రామాలు

అదిలాబాద్ జిల్లా బేల మండలంలో  అయోధ్యలో జరుగుతున్న బాల రామ విగ్రహ ప్రతిష్టాపన అనుసరిస్తూ బేల గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి  కార్యక్రమాలు నిర్వహించారు. అశోక్ నగర్ కాలనీ హనుమాన్ ఆలయం నుంచి  భజన, కీర్తనలతో శోభా యాత్ర యువకులు, మహిళలు, నృత్యాలు చేస్తూ ఊరేగించారు,  భక్తులకు వ్యాపారస్తులు బిస్కెట్లు, పాలు పంపిణీ చేశారు.
ఆనంతరం బేల రామాలయంలో అయోధ్య బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన  కార్యక్రమాన్ని ఎల్ సీడీలో చూశారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 12;30 గంటలకు బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన ఆవిష్కరణ కార్యక్రమం చూసి భక్తులు తరించారు.  మహా అన్నన కార్యక్రమం కొనసాగించారు.   డోప్తాల, అవల్పూర్, సిరసన్న గ్రామాల్లో అయోధ్య బాల రాముడి ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు ప్రత్యక్షంగా వీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *