ఆదిలాబాద్, సిరా న్యూస్
రాముడి ప్రాణప్రతిష్టను ప్రత్యక్షంగా వీక్షించిన గ్రామస్తులు…
ఆదిలాబాద్ జిల్లా సోనాల గ్రామంలో అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్ ఈడీ స్క్రీన్ పై ప్రత్యక్షంగా రాముడి ప్రతిష్టను వీక్షించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షులు, దక్షిణ మధ్య రైల్వే బోర్డు కమిటీ సభ్యులు జీవీ రమణ, రాజు యాదవ్, బీజేపీ బోథ్ మండల అధ్యక్షుడు సూర్య, గ్రామస్తులు రామిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.