Godala Sampat: బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోదల సంపత్ మృతి

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోదల సంపత్ మృతి
నివాళుల‌ర్పించిన రాష్ట్రకార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
* ఫోన్‌లో కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ బండి సంజ‌య్‌కుమార్‌

భీమదేవరపల్లి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గోదల సంపత్ శుక్ర‌వారం మృతి చెందారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గోదల సంపత్ మృత‌దేహంపై బీజేపీ జెండా కప్పి నివాళులు అర్పించారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతు భీమదేవరపల్లి మండల ప్రధానకార్యదర్శి గోదల సంపత్ కొత్తకొండ గ్రామంలో జన్మించార‌ని తెలిపారు. టీడీపీ పార్టీ లో అనేక సంవ‌త్స‌రాలో కొన‌సాగి, గత 6 సంవత్సరాల నుండి బీజేపీ జెండా పట్టుకొని అనేక ప్రజా సమస్య ల మీద పోరాటం చేస్తు ప్రయాణం సాగిస్తున్నారు . ఎంపీ ఎలక్షన్ లల్లో బండి సంజాయ్ కుమార్ గెలుపు కొత్తకొండ గ్రామం లో తనవంతు కృషి ఎంతో ఉంద‌ని తెలియజేశారు. అంత‌కు ముందు ఫోన్‌లో కుటుంబ సభ్యులను ఎంపీ బండి సంజ‌య్‌కుమార్‌ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి మాచర్ల కుమార్గద్ద సమ్మయ్య, హుస్నాబాద్ టౌన్, రూరల్, అక్కణపేట మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, వెల్డండి రాజేందర్ ప్రసాద్, రామంచ మహేందర్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు, ఊసకోయిల కిషన్, ప్రధానకార్యదర్శి గుండెల్లి సదానందం, శ్రీరామోజు శ్రీనివాస్, అంబీర్ కవిత, వేణు, దొంగల రాణా, బొజ్జపురి పృథ్వి, రాంబాబు, కంకల సదానందం, పొదపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *