Godam Ganesh: లక్ష్మణ్ పై దాడికి పాల్ప‌డిన వారిని క‌ఠినంగా శిక్షించాలిః తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షులు గోడం గణేష్

సిరాన్యూస్,ఉట్నూర్‌
లక్ష్మణ్ పై దాడికి పాల్ప‌డిన వారిని క‌ఠినంగా శిక్షించాలిః తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షులు గోడం గణేష్
*  ఉట్నూర్‌ ఐటీడీఏ పీఓకు విన‌తి ప‌త్రం అంద‌జేత‌

ఆదివాసీ యువకుడు మర్సకోల లక్ష్మణ్ పై దౌర్జన్యంగా దాడి చేసిన అల్లరి ముకలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహన‌ అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు. శుక్ర‌వారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ‌, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌ ఐటీడీఏ పీఓకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షులు గోడం గణేష్ మాట్లాడుతూ ఈనెల 13న జైనూర్ లో ఆదివాసీ యువకుడు మర్సుకోలా లక్ష్మణ్ పై జరిగిన దాడిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు, మేధావులు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు.వేంటనే స్పందించి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఆ సంఘటనలో గాయపడిన వ్యక్తులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాల‌న్నారు. అలాగే వారిని కాపాడాలని ఆ కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు. కార్య‌క్ర‌మంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గోడం గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పెందుర్ దదిరావు, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందుర్ పుష్ప రాణి, ఆదిలాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు కుముర జంగు పటేల్ , విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సలాం వరుణ్ , మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సోయం లలిత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *