సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ కు ఘన స్వాగతం
+ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో సన్మాన సభ
+ భారీగా తరలివచ్చిన బిజెపి శ్రేణులు
అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా గొడం నగేష్ కు టికెట్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన సన్మాన సభలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి గొడం నగేష్ ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గొడం నగేష్ మాట్లాడుతూ… బిజెపి అధిష్టానం తనపై నమ్మకంతో టికెట్ ఇవ్వడం సంతోషకరమన్నారు. పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలంతా గెలుపే లక్ష్యంగా ఐకమత్యంగా పనిచేయాలన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్రమోడీ ఆలోచనలకు ప్రభావితుడినై పార్టీలో చేరినట్లు గొడం నగేష్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ… భారతదేశాన్ని యావత్ ప్రపంచానికి విశ్వ గురువుగా మార్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు అంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బోయర్ విజయ్, పార్లమెంట్ కో కన్వీనర్ మయూర్ చంద్ర, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిల్కూరి జ్యోతి రెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు ధోని జ్యోతి, నాయకులు అశోక్, తదితరులు ఉన్నారు.