Godam Nagesh:ముచ్చటగా మూడోసారి మోడీని ప్రధాని చేయాలి

సిరా న్యూస్, సొనాల‌
ముచ్చటగా మూడోసారి మోడీని ప్రధాని చేయాలి
* అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
* బీజేపీలో ప‌లువురు చేరిక

ముచ్చటగా మూడోసారి మోడీని ప్రధాని చేయాలని, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు అట్టడుగు స్థాయి ప్రజలకు కూడా తెలియజేయాలని అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా సొనాల‌లో బోథ్ మండల కార్యకర్తల‌తో విస్తృత సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి బిజెపి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశానికి రావడం జరిగింది. ఈ సంద‌ర్భంగా అదిలాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ బీజేపీ అంటేనే క్రమశిక్షణ. నైతిక విలువలతో కూడిన పార్టీ అని బిజెపి కార్యకర్తలు ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తారని తెలిపారు.అదిలాబాద్ ఎంపీ సీటును కూడా మోడీకి బహుమానంగా అందించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిజెపిలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బిజెపి మండల కన్వీనర్ సుభాష్ పటేల్ సూర్య, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, బిజెపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *