సిరాన్యూస్, సిరికొండ
ప్రతి కార్యకర్త తానే ఒక అభ్యర్థిగా ప్రచారం చేయాలి
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
ప్రతి ఒక్క కార్యకర్త తానే ఓ అభ్యర్థిగా, తానే ఓ నరేంద్రమోడీ గా భావించి క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ, ఇచ్చోడ మండలాలలో మండల స్థాయి కార్యకర్తల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతాంగే బ్రహ్మానంద్ సమీప పార్లమెంట్ ఎన్నికల గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇతర ఏ పార్టీలో లేనివిధంగా నిస్వార్థంగా ప్రభుత్వం, అధికారానికి అతీతంగా సంవత్సరాల పాటు పార్టీయే ప్రాణంగా కష్టపడి పని చేసే ఏకైక కార్యకర్త బీజేపీ కార్యకర్త అని, అంతటి నిబద్ధత కలిగిన ప్రతి కార్యకర్తకు విశ్వాస పాత్రుడిగా ఉంటానని భరోసనిచ్చారు. బోథ్ నియోజకవర్గంలో భౌగోళికంగా ప్రతి ప్రాంతం లో అనువనువునా తెలిసిన వ్యక్తిగా ప్రతి సమస్యపై అవగాహన ఉందని , సిరికొండ, ఇచ్చోడ మండలాలలోని మారుమూల గ్రామాలలో ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉందని , మారుమూల గ్రామాలలో సమూలంగా అభివృద్ధి చేయడానికి మీ ప్రతినిధిగా పార్లమెంట్ కు పంపించాలని గోడం నగేష్ కోరారు. సమావేశంలో అదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పతాంగే బ్రహ్మానంద్, పార్లమెంట్ కో కన్వీనర్ మయూర్ చంద్ర, మండల అధ్యక్షులు, బీజేపీ పార్టీ పదాధికారులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.