Godam Nagesh: సుహాసినిరెడ్డిని క‌లిసిన గొడం న‌గేష్‌

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
సుహాసినిరెడ్డిని క‌లిసిన గొడం న‌గేష్‌
* పార్లమెంట్ ఎన్నికల‌పై కార్యాచ‌ర‌ణ‌

మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి ని ఆదిలాబాద్ పట్టణంలోని ఆమె నివాసంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ టికెట్ ప్రకటన అనంతరం ఆమెను మొదటిసారిగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నగేష్ కి పుష్పగుచ్చం అందజేసి ఆమె స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవలసిన కార్యాచ‌ర‌ణ‌పై చర్చించారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రధాని మోడికి కానుకగా ఇవ్వాలని నేతలు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *