సిరా న్యూస్, ఆదిలాబాద్
గుడిహత్నూర్లో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ విస్తృత ప్రచారం
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో సోమవారం ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్ విస్తృత ప్రచారం నిర్వహించారు .గడప గడపకు వెళ్లి బీజేపీ కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే మల్కాపూర్ గ్రామ ఉపాధి కూలీలతో ముచ్యటించారు. కమలం గుర్తుకే ఓటు వెయ్యాలని అభ్యర్తించారు. ఈ ప్రచారంలో ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్, మండల అధ్యక్షులు జాడి సుభాష్, గుడిహత్నూర్ వైస్ ఎంపీపీ నాగర్గోజే భరత్ జిల్లా అధికార ప్రతినిధి కేంద్రే లక్ష్మణ్, తాంసి జడ్పీటీసీ రాజు, బీజేపీ సీనియర్ నాయకులు వామన్ రావు, మాజీ జడ్పీటీసీ గిత్తే కేశవ్, సుభాష్ రెడ్డి, చట్ల సుఖదేవ్ తదితరులు పాల్గొన్నారు.