సిరాన్యూస్, సిర్పూర్(యు)
గిరిజన కళాకారులను పద్మ పురస్కారాలతో సత్కరించిన ప్రభుత్వం బీజేపీయే
సిర్పూర్(యు) ప్రచార కార్యక్రమంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
వివిధ రంగాలలో రాణిస్తున్న గిరిజనులను గుర్తించి పద్మ పురస్కారాలతో సత్కరించిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. గురువారం సిర్పూర్(యు) మండల కేంద్రంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గస్సాడి వంటి ఆదివాసీ ఆచారాలతో ముడిపడిన సాంస్కృతిక కళలకు ప్రాధాన్యతనిస్తూ కనకరాజు కి పద్మశ్రీ పురస్కారంతో బీజేపీ ప్రభుత్వం సత్కరించిందని గుర్తు చేశారు. 1981లో ఏప్రిల్ 20 నాడు అమాయక ఆదివాసులను అన్యాయంగా పిట్టల్లా కాల్చి చంపిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొసలి కన్నీళ్లు కార్చుతు, హంతకులే నివాళులు ఆర్పిస్తున్నారని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ మాయమాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా అత్యున్నతమైన పరిపాలనను అందిస్తున్న నరేంద్రమోడీ ని మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలంపువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ కోట్నాక్ విజయ్, పార్టీ మండల బాధ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.