సిరా న్యూస్,ఏలూరు;
భద్రాచలం వద్ద వరద ఉదృతి మళ్ళీ పెరుగుతున్న దృష్ట్యా గోదావరి నదీ తీరప్రాంతంలో ఉన్నా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. గోదావరి ఉధృతి దృష్ట్యా ఆయా గ్రామాల ప్రజలు ఎవ్వరూ నదిలోనికి వెళ్ళవద్దన్నారు.