సిరా న్యూస్,హైదరాబాద్;
ఏఐసీసీ ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాల మేరకు చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత, సిద్ధాంతం పట్ల నమ్మకం, అవగాహన ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవాలనిఅధిష్ఠానం నిర్ణయించింది. కమిటీ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి లు ఉంటారు. 25, 26 తేదీలలో రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు గాంధీ భవన్ లో చేరికలు ఉంటాయని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
=======