సిరా న్యూస్,తలమడుగు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన గోక గణేష్
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి (బి), పల్లి (కె), బరంపూర్ గ్రామాల్లో ఈదురు గాలులు, వడగళ్ల వాన వర్షం కురిసింది. దీంతో 1200 ఎకరాల మొక్క జొన్న, పొగ ఆకు, జొన్న పంటలు నేల మట్టమయ్యాయి. మంగళవారం దెబ్బతిన్న పంటలను తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్రెడ్డి పరిశీలించి, ధైర్యం చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాజర్షి షానను కలిసి సర్వే చేయించి రైతులకు నష్టపరిహరం ఇప్పించాలని కోరారు. ఆయన వెంట ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, వ్యవసాయ అధికారులు జేడీ పుల్లయ్య, ఏఓ మహేందర్, ఏఈఓ శ్రావ్య, ఎంపీటీసీ సోమన్న వేంకన్న యాదవ్, రైతులు విఠల్, గంగన్న, లింగారెడ్డి, సంజీవ్, నర్సింహులు, వంశీ గ్రామస్థులు తదితరులున్నారు.