సిరాన్యూస్, తలమడుగు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
* తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్రెడ్డి
* సీసీ రోడ్డు పనులకు భూమి పూజ
ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్రెడ్డి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో ఎన్ ఆర్ ఈజీఎస్
నిధులనుండీ మంజూరు అయిన 5 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం అదే గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, ఎంపీటీసీ వెంకన్న యాదవ్, గంగారం, మోహన్, సల్ల దేవన్న, విట్టల్, నారాయణ గ్రామస్తులు తదితరులున్నారు..