మల్లన్నకు బంగారు, వెండి పుష్పాలు సమర్పణ

 సిరా న్యూస్,శ్రీశైలం;
హైదరాబాద్ కు చెందిన మురళి తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం రోజు బంగారు, వెండి పుష్పాలను దేవస్థానమునకు సమర్పించారు. ఆలయప్రాంగణములో ఈ బంగారు మరియు వెండి పుష్పాలను వసతివిభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి.మోహన్, పర్యవేక్షకులు స్వాములుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ 82 గ్రాములతో 8 నెంబర్లు తామర పువ్వు డిజైన్ కలిగిన పుష్పాలు మరియు 40 గ్రాములతో 110 నెంబర్లు గల వెండి చిన్న పుష్పాలను సుమారు రూ.5.45 లక్షలతో తయారు చేయించినట్లు తెలిపారు. తరువాత దాతలకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను అందజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *