బంగారు ఆభరణాలు ఫోన్లు స్వాధీనం

వ్యక్తి అరెస్ట్

 సిరా న్యూస్,కౌతాళం;
కౌతాళం మండలం, వల్లూరు గ్రామంలోని దేవన్న గౌడ అను వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా ఫిర్యాది దారుడు కుటుంబ సభ్యులతో పాటు వారి ఇంటిపై నిద్రిస్తుండగా నిన్నటి దినము తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ల ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి సుమారు ఐదు తులాల బంగారు ఆభరణములు మరియు రెండు సెల్ ఫోన్లు దొంగలించుకుపోయినారని, నిన్నటి దినము ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కౌతాళం ఎస్ఐ టి నరేంద్ర కుమార్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు లో భాగంగా కోసిగి సీఐ ప్రసాద్ కౌతాళం ఆధ్వర్యం లో టీం ఏర్పాటు చేసి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సోమ్లా నాయక్ మరియు pcs వీరాంజనేయులు, నరేంద్ర, మద్దిలేటి, వీరేష్ మరియు వీరభాస్కర్ ల సహకారంతో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరిత గతిన చేదించి ముద్దాయి వాసయ్య గారి ఈరన్న, 22 సంవత్సరాలు, తండ్రి పేరు. సిద్దప్ప, వల్లూరు గ్రామం కౌతాళం మండలం అను వ్యక్తి ని అరెస్టు చేసి, అతని వద్ద నుండి మొత్తం దొంగలించిన రెండు లక్షల 2,20,000/- వేల విలువ చేసే సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు, 02 సెల్ ఫోన్ లను మరియు నేరానికి ఉపయోగించినటువంటి ఒక ఇనుప రాడును స్వాధీన పరుచుకొని ముద్దయిని రిమాండ్ కి పంపారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *