కాంగ్రెస్ లో చేరేందుకు గాంధీభవన్ తరలి వెళ్తున్న బిజెపి,బీఆర్ఎస్ నేతలు
సిరా న్యూస్,కోరుట్ల;
బిజెపి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పారు.. ఈ మేరకు మంగళవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జంగిలి వెంకటి, ఇబ్రహీంపట్నం మాజీ జెడ్పిటిసి సభ్యురాలు జంగిలి సునీత, సీనియర్ నాయకులు ఆకుల లింగారెడ్డి, భారత రాష్ట్ర సమితికి చెందిన ఇబ్రహీంపట్నం మండల పరిషత్ మాజీ అధ్యక్షులు నేరెళ్ల దేవేందర్ తోపాటు భారత రాష్ట్ర సమితి పార్టీ కి చెందిన పలువురు సర్పంచులు,ఎంపీటీసీలు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు జువ్వాడి నర్సింగరావు నాయకత్వాన్ని బలపచేందుకు గాంధీభవన్ కు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా నర్సింగరావు
జెండా ఊపి బస్సును ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
========================