సిరా న్యూస్,హైదరాబాద్;
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతోపాటు ఆర్థిక సాయం అందజేయనుందని సమాచారం. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనుంది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలను మూడు విడతల్లో జమ చేయనుంది.