సిరా న్యూస్,హైదరాబాద్;
పెండింగ్ చాలన్స్ కు మంచి స్పందన వస్తుందని హైదరాబాద్ జాయిన్ సీపీ విశ్వప్రసాద్ అన్నారు. ఈ నెల 10 వరకు చాలన్స్ క్లియర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. వాహనదారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ లో 3 కోట్ల 59 లక్షల చలన్స్ పెండింగ్ ఉన్నాయి. అందులో ఈ రోజు వరకు 77 లక్షల చలాన్స్ క్లియర్ అయ్యాయి. 67 కోట్లు రూపాయలు పెండింగ్ చలాన్ అమౌంట్ కలెక్ట్ అయింది. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో 18 కోట్లు, సైబరాబాద్ కమిషనర్ పరిధిలో 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 7.15 కోట్లు పెండింగ్ చలాన్స్ అమౌంట్ కలెక్ట్ అయింది. రాష్ట్రంలో మొత్తం 67 కోట్ల పెండింగ్ చలాన్ అమౌంట్ కలెక్ట్ అయింది. ట్రాఫిక్ చలాన్ వెబ్ సైట్ లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఫేక్ చలాన్ వెబ్ సైట్ రెండు ఉన్నాయని సోషల్ మీడియాలో ఆ దృష్టికి వచ్చిందని అన్నారు.
అవి 6 నెలల క్రితం సైబర్ నెరగాళ్లు క్రియేట్ చేశారని మా దృష్టికి వచ్చింది. అప్పుడే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ నకిలీ వెబ్ సైట్ లో పేమెంట్ గేట్ వేస్ లేవు. 6 నెలల క్రితం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్లు రెండు నకిలీ వెబ్ సైట్లను బ్లాక్ చేశారు. వానదారులు అందరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని కోరుతున్నానని అన్నారు.