సిరాన్యూస్, ఓదెల
గూడెంలో తెగిన విద్యుత్ తీగలు.. ఎండిపోతున్న పంటలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో 11కేవీ విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో వ్యవసాయ బావులకు విద్యుత్ లైన్లను విద్యుత్ అధికారులు తొలగించారు. సుమారు వారం రోజుల గడుస్తున్నా నేటికీ విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో పంటలకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు అందోళ చెందుతున్నారు. రైతులు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు.