ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదుట ఆత్మహత్య యత్నం చేసిన గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

సిరా న్యూస్,వనపర్తి;
గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ్రాతి గణేష్ గౌడ్ గురువారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. పదిపది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో యెన్నో కష్టాలు పడి, యెంతో కోల్పోయి , యెన్నో కేసులు అనుభవించి కాంగ్రెస్ పార్టీ ని కాపాడుకుంటూ వచ్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని పార్టీ లో చేరి , టికెట్ తెచ్చుకుని పార్టీ గుర్తు మీద గెలిచి , మళ్లీఅధికారంలో కూర్చున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులని మాకు ఏలాంటి సమాచారం లేకుండా చేర్చుకుంటున్నారు. , కాంగ్రెస్ పార్టీ లో ప్యారషూట్ వాళ్లకు రాజ్యంగా మారింది అని అయన ఆరోపించారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు చివరికు ఆత్మహత్యనే దిక్కు అని అన్నారు, కాంగ్రెస్ పార్టీకి పని చేసిన నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే మెగారెడ్డి ఇంటిని ముట్టడించి ఆవేదన వ్యక్తమ్ చేసారు. ఎమ్మెల్యే ముందు ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *