సిరాన్యూస్, ఆదిలాబాద్
జిల్లా పోలీసుల పూర్తి అప్రమత్తత : ఎస్పీ గౌష్ ఆలం
* ప్రైవేట్ స్కూల్ లో జరిగిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాది కాదు
* నిందితులపై కేసు నమోదు
జిల్లా పోలీసులు పూర్తిగా అప్రమత్తతంగా ఉన్నారని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. నిన్న మంచిర్యాల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనలో నిందితులపై కేసును నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నదని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈ ఘటనతో ఆదిలాబాద్ జిల్లాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పూర్తి అప్రమత్తతతో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను కట్టిదిద్దం చేశామని తెలిపారు. తప్పు చేసేవారు కోర్టుల నుండి శిక్షణ తప్పించుకోలేరని హెచ్చరించారు.