సిరాన్యూస్, తలమడుగు
రూ. 37 లక్షల విలువ గల గంజాయి కాల్చివేత : జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
* 19 కేసుల్లోని 150 కేజీల గంజాయి దహనం
* డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కాల్చివేత
జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్లో నమోదైన 19 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 150 కిలోల నిషేధిత గంజాయి బుధవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామ శివారులను శివారులోని నిర్మానుష్యం అటవీ ప్రాంతంలో పర్యావరణ, కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఐపిఎస్, సభ్యులుగా ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, డిఎస్పి కె సురేందర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కోర్టు వారి అనుమతి తీసుకుని ఈ నిషేధిత గంజాయిని దహనం చేయడం జరిగింది. దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ సుమారుగా 37 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ముందుగా ఎస్పీ ఈ గంజాయిని కేసులవారీగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్ డి పి ఎస్ యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో నిల్వ ఉన్న గంజాయిని దహనం చేయడం జరిగిందని తెలియజేశారు. కొందరు అక్రమార్జన లో భాగంగా గంజాయిని విక్రయిస్తూ డబ్బు సంపాదించాలనే దురాశ, గ్రామీణ ప్రాంత రైతులను ప్రలోభాలకు గురి చేస్తూ గంజాయి రవాణా చేయడం జరుగుతుందని తెలిపారు.గంజాయి, ఇతర మత్తుపదార్థాలను విక్రయించే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులు యువతపై ప్రత్యేక శ్రద్ధను వహిస్తూ పిల్లల దిన చర్యను పరిశీలిస్తూ ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి ఆపరేషన్ కె సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, కే సురేందర్ రెడ్డి, సీఐ లు, ఎస్ఐ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.